Nigeria Boat Accident : నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బోటులో 300 మంది ఉన్నారని, ఓ వేడుకకు వెళ్లివెస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
నైజీరియాలో ఇటువంటి బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. 100 మందికిపైగా గల్లంతైన ఘటనలు 2023 నుంచి ఇప్పటివరకు నాలుగు జరిగాయి. తాజాగా నైజర్ నదిలో 300 మందితో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఈతగాళ్లు, వాలంటీర్లు గాలింపు చర్యలు చేపట్టారు. 150 మందిని రక్షించగలిగారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు బయటకు తీసుకొచ్చారు. మిగతావారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.