28 Dead As Bus With 51 Pilgrims Onboard Falls Into Gorge : పాకిస్థాన్ నుంచి ఇరాక్కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 28 మంది మరణించగా, మరో 23 మంది గాయపడ్డారని, వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని ఇరాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు.
ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం - 28 మంది పాకిస్థానీల మృతి
Published : Aug 21, 2024, 11:04 AM IST
|Updated : Aug 21, 2024, 11:24 AM IST
28 Dead As Bus With 51 Pilgrims Onboard Falls Into Gorge (ETV Bharat)
సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ద్లో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో సుమారు 35 మంది మరణించారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. వీరంతా పాకిస్థాన్లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని లర్కానా నుంచి షియా యాత్రకు వెళ్తున్నట్లు తెలిపింది.
Last Updated : Aug 21, 2024, 11:24 AM IST