తెలంగాణ

telangana

ఇరాన్​లో ఘోర బస్సు ప్రమాదం - 28 మంది పాకిస్థానీల మృతి

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 11:04 AM IST

Updated : Aug 21, 2024, 11:24 AM IST

28 Dead As Bus With 51 Pilgrims Onboard Falls Into Gorge
28 Dead As Bus With 51 Pilgrims Onboard Falls Into Gorge (ETV Bharat)

28 Dead As Bus With 51 Pilgrims Onboard Falls Into Gorge : పాకిస్థాన్ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 28 మంది మరణించగా, మరో 23 మంది గాయపడ్డారని, వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని ఇరాన్‌ ప్రభుత్వాధికారులు తెలిపారు.

సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ద్‌లో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో సుమారు 35 మంది మరణించారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. వీరంతా పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా నుంచి షియా యాత్రకు వెళ్తున్నట్లు తెలిపింది.

Last Updated : Aug 21, 2024, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details