తెలంగాణ

telangana

ETV Bharat / snippets

'కల్కి' టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - ఎంత పెరిగాయంటే?

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 9:04 AM IST

Updated : Jun 25, 2024, 9:09 AM IST

source Getty Images and ETV Bharat
kalki (source Getty Images and ETV Bharat)

Kalki 2898AD Tickets : ప్రభాస్‌ కల్కి సినిమా టికెట్​ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్‌ 27న రిలీజ్​ కానున్నఈ చిత్ర టికెట్​ ధరల పెంపునకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా టిక్కెట్ ధరల్ని పెంచుకోడానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. టిక్కెట్ ధరల్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75కు, మల్టీ స్క్రీన్స్ థియేటర్లలో రూ.125కు పెంచడానికి వీలు కల్పించారు. సినిమా విడుదలైన తేదీ నుంచి రెండు వారాల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోడానికి వెసులుబాటు కల్పించారు. ఇంకా రోజుకు ఐదు షోలు ప్రదర్శన వేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సినిమాలో అమితాబ్, దీపికా, దిశాపటానీ, కమల్​హాసన్, శోభన కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్​పై అశ్వనీదత్ నిర్మించారు.

Last Updated : Jun 25, 2024, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details