బిహార్లోని సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట - ఏడుగురు మృతి!
Published : Aug 12, 2024, 7:32 AM IST
|Updated : Aug 12, 2024, 8:31 AM IST
Stampede In Bihar: బిహార్ జెహనాబాద్ జిల్లాలోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముందుగా కన్వారియాల మధ్య వాగ్వాదం జరిగిందని, చివరికి అది తొక్కిసలాటకు దారితీసిందని జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పాండే తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.