మట్టి పెళ్లలు విరిగిపడి 9మంది మృతి- రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
Published : 9 hours ago
Gujarat Wall Collapse :గుజరాత్ మెహసాణా జిల్లాలో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మెహసామా జిల్లాలో జరిగింది. జసల్పుర్ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్ను కూలీలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో వదులుగా ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా వారిపై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.