Published : Aug 28, 2024, 12:52 PM IST
'మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వొచ్చు' - సుప్రీం కోర్టు
SC On Money Laundering Case Bail : మనీలాండరింగ్ కేసు నమోదైనప్పటికీ నిందితుడికి బెయిల్ ఇచ్చే నిబంధనలు, జైలు నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాశ్కు బెయిల్ మంజూరు చేసింది. ఏ వ్యక్తి స్వేచ్ఛనూ హరించరాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. పీఎమ్ఎల్ఏ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం నిందితుడికి విధించిన రెండు బెయిల్ షరతులు, అతడి స్వేచ్ఛను హరించాలనే కొత్త సిద్ధాంతాన్ని లిఖించలేవని ధర్మాసనం పేర్కొంది. ఆప్ నేత మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరు చేస్తూ ఆగస్టు 9న ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ కేసులో ప్రేమ్ ప్రకాశ్కు మార్చి 22న బెయిల్ నిరాకరిస్తూ ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన ధర్మాసనం పక్కన పెట్టింది.