ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి చేసిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్పై సుప్రీంకోర్టు మండిపడింది. "సీఎం నివాసం ప్రైవేట్ బంగ్లానా? ఇలాంటి గూండా అక్కడ పనిచేయొచ్చా?" అని బిభవ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
'సీఎం ఇల్లు ఏమైనా ప్రైవేట్ బంగ్లానా? ఇలాంటి గూండా అక్కడ పనిచేయొచ్చా?'- బిభవ్పై సుప్రీం ఆగ్రహం
Published : Aug 1, 2024, 12:53 PM IST
'సీఎం నివాసంలో దాడి జరిగితే స్వాతి పోలీసు హెల్ప్లైన్కు ఫోన్ చేయడం దేన్ని సూచిస్తుంది? సీఎం అధికారిక నివాసంలోకి ప్రవేశించిన గుండాలాగా బిభవ్ ప్రవర్తించారు. స్వాతి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా ఆమెపై దాడి చేశారు' అని బిభవ్ తరఫు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
కేసు పరిశీలన కోసం ఛార్జిషీట్ను తమ ముందు ఉంచాలని చెప్పి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. స్వాతిపై దాడి కేసులో బిభవ్ బెయిల్ పిటిషన్ను దిల్లీ హైకోర్టు తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.