national

డైరెక్ట్​ పాలిటిక్స్​లోకి ప్రశాంత్​ కిశోర్ రీ ఎంట్రీ- ఆరోజే కొత్త పార్టీ స్టార్ట్​- కూటమి ప్రభుత్వంతో ఢీ!

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 8:17 AM IST

Prashant Kishore Political Party
Prashant Kishore Political Party (ANI)

Prashant Kishore Political Party :ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నారు. గాంధీ జయంతి రోజున 'జన్‌ సురాజ్‌' పార్టీని స్థాపించనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 'జన్‌ సురాజ్‌' పేరుతో క్యాంపెయిన్‌ నడుపుతున్న ప్రశాంత్‌ కిశోర్‌, అదే పేరును రాజకీయ పార్టీకి పెట్టనున్నట్లు ఆదివారం పట్నాలో నిర్వహించిన జన్​ సురాజ్​ వర్క్​షాప్​లో వెల్లడించారు. కొత్త పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. మెరుగైన విద్య, వైద్యం, బిహార్‌ భవిష్యత్తు కోసం శ్రమించాలని కార్యకర్తలకు ప్రశాంత్‌ కిశోర్‌ దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల క్రితం బిహార్‌లో 'జన్‌ సురాజ్‌' యాత్రను ప్రశాంత్‌ కిశోర్‌ ప్రారంభించారు. అయితే ప్రశాంత్​ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ, జేడీ(యూ) కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొడతారా, లేక ఆర్​జేడీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details