national

ETV Bharat / snippets

'కావడి' యాత్రికులపైకి దూసుకెళ్లిన ట్రక్- ఐదుగురు మృతి

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Kanwariyas Accident
Kanwariyas Accident (Etv Bharat)

Kanwariyas Accident :బిహార్​ బంకా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కన్వరియాలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఫులిదుమర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కన్వరియాలు(శివభక్తులు) సుల్తాన్​గంజ్ నుంచి జస్త్​ గౌర్​ నాథ్​ మహదేవ్ ఆలయానికి వెళ్తున్న క్రమంలో ట్రక్కు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. స్థానికుల రాళ్లదాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. స్థానికులు అంబులెన్స్​పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details