Maharashtra Jharkhand Polls AAP : మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రానున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ఆప్ యూనిట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆస్తకిగా ఉందని, కానీ అదిష్ఠానం అందుకు మొగ్గు చూపే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమిని బలోపేతం చేయాలనే కోరుకుంటుందని చెప్పాయి. అంతేకాకుండా బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి దారితీసే విధంగా గందరగోళాన్ని సృష్టించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి.