national

ETV Bharat / snippets

చెన్నై శివారులో రైలు ప్రమాదం- గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్​

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 9:54 PM IST

Updated : Oct 11, 2024, 10:27 PM IST

Tamilnadu Train Accident
Tamilnadu Train Accident (ETV Bharat)

Tamilnadu Train Accident : తమిళనాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల నుంచి మంటలు చెలరేగగా ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, 10 మంది ప్రయాణికులు గాయపడినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన రైలు మైసూరు - దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578 )గా గుర్తించారు. పట్టాలపై ఆగిఉన్న సరకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు అంబులెన్సులు, రెస్క్యూ వాహనాలను అందుబాటులో ఉంచారు.

Last Updated : Oct 11, 2024, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details