ETV Bharat / snippets

మట్టి పెళ్లలు విరిగిపడి 9మంది మృతి- రూ.2 లక్షల ఎక్స్​గ్రేషియా

author img

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Gujarat Wall Collapse
Gujarat Wall Collapse (ETV Bharat)

Gujarat Wall Collapse : గుజరాత్‌ మెహసాణా జిల్లాలో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మెహసామా జిల్లాలో జరిగింది. జసల్‌పుర్‌ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్‌ను కూలీలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో వదులుగా ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా వారిపై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Gujarat Wall Collapse : గుజరాత్‌ మెహసాణా జిల్లాలో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మెహసామా జిల్లాలో జరిగింది. జసల్‌పుర్‌ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్‌ను కూలీలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో వదులుగా ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా వారిపై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.