national

అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి!

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 7:20 AM IST

Sitaram Yechury Health Update
Sitaram Yechury Health Update (ANI)

Sitaram Yechury Health Update :కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ ఇండియా (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. సోమవారం సాయంత్రం ఆయన్ను ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

వైద్య పరీక్షల కోసం ఏచూరి ఎయిమ్స్‌కు వెళ్లారని, నిమోనియా ఉందని తేలడం వల్ల అక్కడే చికిత్స పొందుతున్నట్లు సీపీఐ(ఎమ్) వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొన్నాయి. సీతారాం ఏచూరికి ఇటీవలే కంటి శుక్లాల ఆపరేషన్‌ జరిగింది.

ABOUT THE AUTHOR

...view details