national

రైలు పట్టాలపై 140 కిలోల సిమెంట్ దిమ్మెలు- తప్పిన భారీ ప్రమాదం!

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 3:01 PM IST

Cement Blocks on Railway Tracks
Cement Blocks on Railway Tracks (ETV Bharat)

Cement Blocks on Railway Tracks : ఉత్తర్‌ప్రదేశ్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించాలని కొందరు దుండగులు కుట్ర పన్నిన విషయం మరువక ముందే మరోచోట అదే తరహా ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై రెండు సిమెంట్‌ దిమ్మెలను ఉంచి గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు యత్నించారు దుండగులు. శారధ్నా, బంగాడ్ స్టేషన్‌ మధ్య ఈ ఘటన జరిగింది. సిమెంట్ దిమ్మె ఒక్కొక్కటి 70 కిలోల చొప్పున బరువు ఉందని, రైలు వాటిని ఢీకొట్టినప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details