'విమానయాన శాఖ మంత్రిగా నేను చేసే పని అదే!'
Published : Jun 11, 2024, 4:26 PM IST
Civil Aviation Minister Interview : ఆర్థిక, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విమానాల్లో ప్రయాణించేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు నూతన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. శాఖ బాధ్యతలు స్వీకరించాక సమీక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ధనవంతులు మాత్రమే కాకుండా, సామాన్యులు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి వారికి సౌకర్యవంతమైన, మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తనపై ఇంత పెద్ద బాధ్యతను పెట్టినందుకు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని వివరించారు.