ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 11:03 AM IST

ETV Bharat / videos

కంబోడియాలో చిక్కుకున్న అందరికీ విముక్తి కల్పిస్తాం- 'నరకయాతనకు గురిచేసిన సైబర్‌ ముఠా' - Cambodia cybercrime

Visakha CP Ravi Shankar Media Conference on Cambodia Cybercrime : కంబోడియా సైబర్‌ క్రైమ్‌ నేరాల బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోందని విశాఖ సీపీ రవి శంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. పోలీస్‌ కమిషనరేట్‌లో బాధితులతో మీడియా సమావేశం నిర్వహించారు. కంబోడియాలో చిక్కుకున్న మిగతావారినీ రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కంబోడియాలో 150 మంది బాధితులు ఉన్నట్టు చెప్పారు. ఈ రాకెట్‌లో ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వారిలో కొందరిని అరెస్ట్‌ చేశామని అన్నారు. వీరిలో విశాఖ పరిసర వాసులు ఉన్నట్లు గుర్తించారు.

మన దేశంలో మొబైల్ నెట్ వర్క్ సిం కార్డులను తీసుకుని వెళ్లి మన దేశ ప్రజల మీద ప్రయోగించి ఆ సొమ్ములు చైనా కంపెనీలు కొట్టేశాయని అన్నారు. అంతే కాదు వాటినే క్రిప్టో కరెన్సీగా మార్చుకుని లబ్ది పొందారని చెప్పుకొచ్చారు. కంబోడియాలో కంపెనీలు పెట్టి చైనా మోసాలు చేస్తోందని ఆరోపించారు. కంబోడియాలో సైబర్‌ క్రైమ్‌ ముఠా తమను నరకయాతనకు గురి చేసిందని బాధితులు వాపోయారు. తమను కాపాడిన విశాఖ పోలీసు అధికారులకు బాధితులు ధన్యవాదాలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details