ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే- వర్ల రామయ్య మీడియా సమావేశం - varla ramaiah media conference

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 1:19 PM IST

Updated : Sep 10, 2024, 1:39 PM IST

varla ramaiah (ETV Bharat)
Varla Ramaiah Media Conference: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో వెల్లడించారు. ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవని నిర్ధారించారు. దీంతో బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని, సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కొట్టుకొచ్చిన 3 పడవలూ కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను విజయవాడ జైలుకు తరలించారు. రిమాండ్ విధించడంతో కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. కాగా ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్​ అనుచరుల బోట్లు ఉన్నట్లు ఇప్పటికే నివేదికలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్​, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Sep 10, 2024, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details