తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై బండి సంజయ్ మీడియా సమావేశం - BANDI SANJAY ON GROUP 1 EXAMS

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2024, 5:13 PM IST

Updated : Oct 19, 2024, 5:32 PM IST

Union Minister Bandi Sanjay On Group 1 Exams : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభ్యర్థులకు అండగా బీజేపీ ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం ఇవాళ కూడా కొనసాగుతోంది. పరీక్ష యధాతథంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల వాయిదా, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులు సహా వారికి మద్దతుగా నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు.మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైన కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Last Updated : Oct 19, 2024, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details