తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : అసెంబ్లీ మీడియా పాయింట్​ - ప్రత్యక్షప్రసారం - TELANGANA ASSEMBLY LIVE

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2024, 10:09 AM IST

Updated : Dec 21, 2024, 4:39 PM IST

Telangana Assembly Winter Session Live : అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఏడో రోజు కొనసాగుతున్నాయి. శాసన సభలో ఇవాళ భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ జరగుతోంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎత్తివేసి ఉదయం 10 గంటలకు చర్చిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన నాలుగు బిల్లులను ఇవాళ శాసన మండలిలో సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశ పెడతారు. జీహెచ్​ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రవేశపెడతారు. పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, భూ భారతి బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రవేశపెడతారు. తరువాత మండలిలో రైతు భరోసా విధివిధానాలపై లఘు చర్చ జరగుతుంది. శుక్రవారం శాసన సభలో భూ-భారతి బిల్లు సహా రైతు భరోసా, రాష్ట్ర అప్పులపై చర్చ జరిగింది. అటు శాసనమండలిలో గురుకులాల మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అసెంబ్లీ నుంచి ప్రత్యక్షప్రసారం.
Last Updated : Dec 21, 2024, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details