తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 2:14 PM IST

ETV Bharat / videos

ఒకే చక్రంతో కన్యాకుమారి టు కశ్మీర్ సైకిల్ రైడ్- ఎందుకంటే? - Single Wheel Bicycle Ride

Single Wheel Bicycle Ride In Karnataka : ఒకే చక్రంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాడు ఓ యువకుడు. కేవలం వెనక చక్రంతో మాత్రమే సైకిల్​ నడుపుతున్నాడు. అతడే కేరళలోని కన్నూర్​కు చెందిన సతిన్.  

గతేడాది డిసెంబర్ 15న సనిత్ మరో ఇద్దరు యువకులు తాహిర్, అభిషేక్​తో కలిసి కన్యాకుమారి నుంచి కశ్మీర్​కు సైకిల్ యాత్రను ప్రారంభించాడు. 'సే నో టు డ్రగ్స్' అనే థీమ్​తో ఈ యాత్రను కన్యాకుమారి నుంచి మొదలు పెట్టాడు. అయితే సనిత్ మాత్రమే ప్రత్యేకంగా ఒకే చక్రం ఉన్న సైకిల్​పై రైడ్ చేస్తున్నాడు. కశ్మీర్​ వరకు అలాగే ఒకే చక్రంతోనే వెళ్లనున్నాడు. అయితే మధ్యలో తాహిర్​కు ఛాతిలో నొప్పి రావటం వల్ల వెనక్కి వెళ్లిపోయాడు. ఇటీవల సనిత్, అభిషేక్ కర్ణాటకలోని కారవారకు చేరుకున్నారు. ఆ తర్వాత గోవాకు వెళ్లి అక్కడ నుంచి కశ్మీర్​కు ప్రయాణం కొనసాగించనున్నారు. సనిత్ చేస్తున్న ఈ సాహసాన్ని చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details