వైఎస్సార్సీపీ అధిష్ఠానం కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించింది: సిద్ధారెడ్డి - Siddha Reddy suspended
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 5:27 PM IST
YSRCP Siddha Reddy suspended : పదేళ్లపాటు పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ అవమానించిందని ఆ పార్టీ మాజీ శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాలలో ప్రకటించడం ఆ పార్టీ అధిష్ఠానం ధోరణికి అడ్డం పడుతుందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో దివాలా తీసింది అన్నారు.
అలాంటి పరిస్థితుల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనులు పూర్తి చేసి పార్టీని తన భుజాల మీద వేసుకున్నా సిద్ధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలపాటు కార్యకర్తలను, పార్టీని కాపాడని తనను కాదని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొందరు స్వార్థపరులు సూచించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారన్నారు. ఏడు నెలల కాలంలో పార్టీని గాని, అధినేతను కానీ ఎక్కడ విమర్శించలేదన్న విషయాన్ని పార్టీ పెద్దలకు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పరువును బజారుకీర్చిన వ్యక్తుల మాటలను నమ్మి తనను సస్పెండ్ చేయడం బాధించిందని సిద్ధారెడ్డి అన్నారు.