ప్రజల సేవ జోగి రమేష్కు అవసరం లేదు - జగన్ కళ్లల్లో ఆనందమే కావాలి: సమతాసైనిక్ దళ్ - Samatha Sainik Dal leaders meeting - SAMATHA SAINIK DAL LEADERS MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 7:01 PM IST
Samata Sainik Dal Leaders fire on YCP Government : జగన్ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నేత జోగి రమేష్ ప్రయత్నిస్తున్నాడని సమతాసైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సురేంద్ర ఆరోపించారు.పెనమలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగి రమేష్ మెుదట మైలవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అక్కడి ప్రజలు ఓడించడంతో పెడన నియోడజకవర్గానికి వలస వచ్చాడని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో పెడన ప్రాంత ప్రజలు కూడా ఓడిస్తారనే భయంతో పెనమలూరుకు వచ్చాడని తెలిపారు. నిజంగా పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు ఈ కుట్రలన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతన్ని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
అలాగే కృష్టా జిల్లాలో ఎస్పీని, కలెక్టర్ను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు, గంజాయి వ్యాపారాలు అన్ని కూడా జోగి రమేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. జోగి రమేష్కు ప్రజలకు సేవ చేయాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదన్నారు. కేవలం జగన్ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే ఆయన పని చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల కోసం ప్రత్యేకంగా ఒక్క పథకాన్ని కూడా పెట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న 27 పథకాలకు కూడా స్వస్తి పలికి జగన్ రక్షాసానందం పొందుతున్నారని పిల్లి సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.