Published : May 5, 2024, 1:08 PM IST
|Updated : May 5, 2024, 5:51 PM IST
LIVE : గద్వాలలో కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్గాంధీ - Rahul Gandhi campaign in TS live
Rahul Gandhi Live : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ, అదే ఊపును పార్లమెంట్ ఎన్నికలో కొనసాగించాలని చూస్తోంది. ఈసారి రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 14 స్థానాలు గెలిచి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానం పక్కా వ్యూహాలతో ఎన్నికల సమరంలోకి దూకింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో పర్యటిస్తూ సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని అంటున్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనల వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. తొలుత నిర్మల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత గద్వాలలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Last Updated : May 5, 2024, 5:51 PM IST