By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 3:56 PM IST
తిరుపతి శివారులో గుడిసెలు తొలగింపు - తీవ్ర ఉద్రిక్తత
Police Removed Huts in Tirupati : తిరుపతి నగర శివారు కరకంబాడి సమీపంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోరంబోకు భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు పోలీసులు యత్నించారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల పేదలు గుడిసెలు వేసుకున్నారు. నెల రోజులుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను తొలగించేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో 5 జేసీబీలతో పాటు వందలమంది పోలీసులు గుడిసెల వద్దకు చేరుకున్నారు.
పోరంబోకు స్థలంలో వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న పోలీసులను పేదలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, పేదలకు మధ్య జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్లారు. ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు ఆక్రమించినా పట్టించుకోకుండా తమపై మాత్రం దాడులకు దిగుతున్నారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గుడిసెలు తొలిగించిన పోలీసులు, ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.