తెలంగాణ

telangana

మళ్లీ తెరుచుకున్న నాగార్జునసాగర్​ డ్యామ్ - ఆరు గేట్లు ఎత్తి నీటి విడుదల - Nagarjuna Sagar Project Gates Open

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 11:35 AM IST

Nagarjuna Sagar Project Gates Open Today (ETV Bharat)

Nagarjuna Sagar Project Gates Open Today : నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. తొలుత బుధవారం సాయంత్రం రెండు గేట్లను ఎత్తిన అధికారులు గురువారం ఆరు గేట్లను తెరిచారు. ఐదు అడుగుల మేరకు గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 48 వేల 600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం ఇన్​ఫ్లో 95 వేల 469 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంతే మొత్తంలో నీరు జలాశయం నుంచి ఔట్​ఫ్లోగా వెళ్తోంది. 

నాగార్జునసాగర్ జలాశయం ఇప్పటికే నిండు కుండలా ఉండగా మొత్తం నీటి మట్టం 590 అడుగులకు అంతే మొత్తంలో నిండింది. ఆగస్టు 5 నుంచి డ్యాం క్రస్ట్​ గేట్లను ఎత్తి 12 తేదీ వరకు నీటిని విడుదల చేశారు. వరద ఉద్ధృతి తగ్గడంతో గేట్లను మూసివేశారు. మళ్లీ తాజాగా వరద ప్రభావం కొనసాగుతుండటంతో అధికరాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆరు గేట్లు ఎత్తడంతో సాగర్ వద్ద పర్యాటకుల సందడి మొదలైంది.

ABOUT THE AUTHOR

...view details