ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంబేడ్కర్ విగ్రహం పేరుతో జగన్‌ రూ.200కోట్లు కొట్టేశారు: మంత్రి డోలా - Minister Dola on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 10:45 PM IST

ycp_minister_dola_on_jagan (ETV Bharat)

Minister Dola on Jagan Name Removal From Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహాన్ని జగన్ హడావిడిగా పెట్టి 200కోట్లకు పైగా కొట్టేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. అంబేడ్కర్‌ పేరు కన్నా జగన్‌ పేరు పెద్దగా పెట్టుకోవడంతో వైసీపీ అనుచరులే ఆయన పేరును తొలగించారన్నారు. ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యపు పేపర్‌ను అడ్డుపెట్టుకొని రోజుకొక తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్​సీపీ పాలనలో దళితులకు అమలు చేస్తున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగిస్తే ఆందోళనలు చేయడం సరికాదని అన్నారు. తమ పాలనలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని అప్పుడు జగన్ అతని అనుచరులు ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అంబేద్కర్ పేరు పెట్టకుండా తాటికాయ అంతా అక్షరాలతో విగ్రహం ముందు జగన్ పేరు రాసుకుంటే అంబేద్కర్ అభిమానులు ఎలా ఊరుకుంటారని మంత్రి డోలా ప్రశ్నించారు

ABOUT THE AUTHOR

...view details