తెలంగాణ

telangana

ఎవరేమనుకున్నా పట్టించుకోను - కేవలం దానికోసమే కాంగ్రెస్​ పార్టీలో చేరా : ఎమ్మెల్యే సంజయ్ - Jagityala MLA Sanjay ON Cm Revanth

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 6:14 PM IST

Jagtial MLA Sanjay Distribution OF CM Relief Fund cheques (ETV Bharat)

Jagtial MLA Sanjay Distribution OF CM Relief Fund cheques : ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని, నియోజవకర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గానికి రెట్టింపు నిధులు తెస్తానని ఆయన తెలిపారు.

జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 247 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. రూ.58 లక్షల 20 వేల విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను సైతం లబ్దిదారులకు అందజేశారు. జిల్లా అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమని, అందుకే కాంగ్రెస్​లో చేరానన్నారు. జగిత్యాలలోని నూకపెల్లిలో 4500 డబుల్ బెడ్ రూమ్​ల మౌలిక వసతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.32 కోట్ల నిధులు కేటాయించారని సంజయ్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details