తెలంగాణ

telangana

అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దాడి - సెల్​ఫోన్​, డబ్బులు లాక్కొని పరారైన దుండగులు

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 10:37 PM IST

Attack on Telangana Student in America

Hyderabad Youth Attacked in America : అమెరికాలోని షికాగో నగరంలో హైదరాబాద్​కు చెందిన యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు లంగర్​ హౌస్​ ప్రాంతానికి చెందిన సయ్యద్​గా గుర్తించారు.​ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు, ఇండియన్​ వెస్లీ యూనివర్సిటీలో మాస్టర్​ చదువుతున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న హోటల్​కు వెళ్లి ఆహారం తీసుకుని వస్తుండగా ముగ్గురు దుండగులు అతన్ని వెంబడించి, రక్తం వచ్చేలా తీవ్రంగా గాయపరిచారు.

అనంతరం అతని దగ్గర ఉన్న సెల్​ఫోన్​, డబ్బులను లాక్కొని పరారైనట్లు సమీపంలోనున్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై హైదరాబాద్​లోని లంగర్​ హౌస్​ పోలీసులను ఆరా తీయగా వారికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పరిపాటిగా మారుతుండటంతో, విదేశీ చదువులంటేనే యువతలో ఏదో తెలియని గుబులు చెలరేగుతుంది. తల్లిదండ్రులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details