ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తోటపల్లి జలాశయ కుడి ప్రధాన కాలువకు గండి- పంట నష్టంపై రైతుల ఆందోళన - Hole to Totapalli Canal

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 3:46 PM IST

Hole to Totapalli Canal: విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేసే తోటపల్లి జలాశయానికి ఇంకా కష్టాలు తొలగలేదు. కుడి ప్రధాన కాలువకు 38వ కిలోమీటర్ వద్ద భారీ గండి పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గండి కారణంగా కాలువ నీరంతా పొలంలోకి వెళ్లడంతో పంటలు పాడైపోయాయని రైతన్నలు వాపోతున్నారు. బాడంగి మండలం అల్లు పాల్తేరు వద్ద గండి పడడంతో అధికారులు చేసేదేంలేక నీటి సరఫరాలను నిలుపుదల చేశారు. నీరు వదిలిన వారం రోజులకే గండిపడడంతో రైతులు విస్తుపోతున్నారు. 

గతేడాది 37వ కిలోమీటర్ వద్ద గండిపడటంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ అదే ప్రాంతంలో గండిపడడంతో అధికారులకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎమ్మెల్యే బేబీ నాయన గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు కూడా భరోసా ఇచ్చారు. అలాగే డి.ఈ కుమార్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా పూడిక తొలగించుకోవడంతో తరచూ గండ్లు పడుతున్నాయని తెలిపారు. తొందరగా పనులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details