ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కన్నా లక్ష్మీనారాయణ ఔదార్యం- సొంత ఖర్చులతో ప్రయాణికులకు ఆటోలు ఏర్పాటు - Kanna Helped Passengers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 4:26 PM IST

Former Minister Kanna Helped Passengers: వైసీపీ 'సిద్ధం' సభకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి బస్సులు తరలించారు. డిపో పరిధిలో ఉన్న 45 బస్సుల్లో వైసీపీ కార్యక్రమానికి 25 బస్సుల్ని మళ్లించారు. దీంతో బస్సులు లేక బస్టాండ్‌లో పడిగాపులు కాస్తూ ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కుగా ఉండటంతో ఉన్న కొద్ది బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయాణికుల అవస్థలు గమనించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఔదార్యం చాటారు. ప్రయాణికుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.

RTC Buses Transport for CM Meeting: ఉదయం నుంచి బస్సుల్లేక ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో సొంత ఖర్చులతో మాజీ మంత్రి కన్నా ప్రయాణికుల కోసం ఆటోలు ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు చెల్లించి, ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. సీఎం సభకు వైసీపీ నేతలు భారీగా ఆర్టీసీ బస్సులు తరలించటంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details