LIVE : ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ధర్నా - పాల్గొన్న కిషన్రెడ్డి - Kishan Reddy Live from hyd
Published : Jul 9, 2024, 1:04 PM IST
|Updated : Jul 9, 2024, 1:20 PM IST
Kishan Reddy Live (ETV Bharat)
Kishan Reddy Live : ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు ప్రతీ నెల రూ.2,500 ఇస్తామన్నారు. ఒక్కో మహిళకు రేవంత్ ప్రభుత్వం రూ.20 వేల బాకీ ఉంది. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కల్యాణ లక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాం. అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి.. బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకున్నాం. హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తా'మన్నారు.
Last Updated : Jul 9, 2024, 1:20 PM IST