ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు సన్నద్ధం కావాలి: సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna on Union Budget

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 7:35 PM IST

CPI_Ramakrishna_on_AP_Special_Funds_in_Union_Budget_2024 (ETV Bharat)

CPI Ramakrishna on AP Special Funds in Union Budget 2024: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల జపం చేయడం వల్ల రాజధాని అభివృద్ధి కాకుండా పోయిందని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.33 వేల కోట్ల ప్యాకేజీకి తగు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి బుందేల్​ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇస్తే తప్ప ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం లేదన్నారు. చెన్నై కారిడార్, హైదరాబాద్, బెంగళూరు కారిడార్​ల విషయంలో ఆయా ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తే కొంతమేరకు ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జేడీయూ నేత నితీష్ కుమార్​తో కలిసి కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకునేందుకు సన్నద్ధం కావాలని కోరుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details