తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 6:31 PM IST

Updated : Mar 6, 2024, 8:19 PM IST

ETV Bharat / videos

LIVE : పాలమూరు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్‌రెడ్డి - ప్రత్యక్షప్రసారం

Congress Praja Deevena Sabha Live : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం హాజరయ్యారు. తొలుత రేవంత్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని క్రీడల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో ఎంవీఎస్‌ మైదానం మైదానికి ర్యాలీగా చేరుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో 15 రోజుల కిందట ప్రారంభమైన వంశీచంద్‌ యాత్ర, 7 నియోజకవర్గాల్లో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ప్రజాదీవెన బహిరంగసభ పేరుతో నిర్వహించిన కాంగ్రెస్ ముగింపు సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని ఆ పార్టీ ప్రారంభించలేదు. సొంత జిల్లా కావడంతో మహబూబ్‌నగర్‌ నుంచే ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సభలో రాజకీయ విమర్శలే ప్రధాన అస్త్రాలుగా రేవంత్‌రెడ్డి సంధించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Mar 6, 2024, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details