LIVE : తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ నేతల మీడియా సమావేశం - BRS Leaders Press Meet

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

thumbnail
BRS Leaders Press Meet at Telangana Bhavan : రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు బీఆర్​ఎస్​ పార్టీ బీఆర్​ఎస్​ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంజయ్​, రాజయ్య, మెతుకు ఆనంద్​తో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురికి బీఆర్​ఎస్​ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ఆ కమిటీ ఇవాళ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. గాంధీ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలపై నివేదిక కోరారు. గాంధీ ఆసుపత్రిలో బీఆర్​ఎస్​ నేతల పర్యటన దృష్ట్యా పోలీసు భద్రతను పెంచారు. ఆసుపత్రిలోకి బీఆర్​ఎస్​ నేతలు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీఆర్​ఎస్​ కమిటీలోని ముగ్గురు నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఆసుపత్రుల్లో అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని బీఆర్​ఎస్​ ప్రశ్నించింది. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకు అని అడిగారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని భావిస్తున్నారా అంటూ బీఆర్​ఎస్​ పలు ప్రశ్నలను సంధించింది. పోలీసుల చర్యలకు నిరసిస్తూ ఇవాళ హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.