LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్‌ - KTR PRESS MEET LIVE

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

thumbnail
KTR PRESS MEET LIVE : రాష్ట్రంలో అమృత్​ టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ బీఆర్ఎస్ భవన్‌లో మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.8,888 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభకోణం ప్రారంభమైందని అన్నారు. బావమరిది, తమ్ముళ్లకు అమృతం, ప్రజలకు విషం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన చెందారు. అమృత్​ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మరోసారి ఆరోపణలు చేశారు. బావమరిది కళ్లల్లో ఆనందం, ఇళ్లలో లంకె బిందెల కోసం సీఎం రేవంత్​ రెడ్డి ఐహెచ్​పీని అడ్డం పెట్టుకొని అవినీతికి తెర లేపారని కేటీఆర్​ విమర్శించారు. అమృత్​ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేదని, ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టడం లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్​ రెడ్డి దొరికిపోయారు, తప్పించుకోలేరని రాజీవ్​ గాంధీ తెచ్చిన చట్టం ప్రకారం ప్రాసిక్యూట్​ తప్పదని కేటీఆర్​ తెలిపారు. 
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.