Published : Aug 29, 2024, 2:11 PM IST
|Updated : Aug 29, 2024, 5:16 PM IST
గాజులరామారంలో కాల్పుల కలకలం - దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Firing In Medchal District
Firing In Medchal District : మంగళవారం అర్ధరాత్రి గాజుల రామారంలోని ఓ బార్ వద్ద తుపాకీ మోతలు స్థానికులను హడలెత్తించాయి. పెట్రోల్ కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదం గన్తో కాల్చుకునేంతవరకు దారి తీసింది. ఒక వర్గానికి మద్దతుగా ఓ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న తుపాకీని తీసి గాల్లోకి ఆరు రౌండ్ కాల్పులు జరిపాడు. ఘటనలో మరో వర్గానికి చెందిన వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకొని ఇరువర్గాలను స్టేషన్కు తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైరింగ్ జరిగిన మాట వాస్తవమేనని, ఓ వ్యక్తి కాల్పులు జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే గన్ ఎక్కడిది? ఎవరు తెచ్చారు? ఎవరు కాల్చారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. కాగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరాల్సి ఉంది.