ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 10:57 AM IST

ETV Bharat / videos

దుకాణం ఎవరిదైన 'మా నమ్మకం నువ్వే జగన్' బోర్డు ఉండాల్సిందే - లేదంటే?

CM Jagan Campaign Boards on Businessman Shops : దుకాణం వీరిది ప్రచారం వారిది. ఇది బాపట్ల జిల్లా చీరాలలో దుకాణ సముదాయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రచార బోర్డులు ప్రచారానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అధికార పార్టీ దాన్ని వేదికగా మార్చుకుంటోంది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులు తినే చిక్కీల మీదతో పాటు ఆరోగ్యరక్ష శిబిరాల్లో రోగులకు అందజేసే సంచులపైన సీఎం జగన్ బొమ్మలు ముద్రిస్తున్నారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి వ్యాపారస్థుల దుకాణాల పైన జగన్ బొమ్మలతో ప్రచార బోర్డులు చేరాయి.

బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో విజిలిపేటకు వెళ్లేదారిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టరు బీఆర్ అంబేడ్కర్ పేరుతో దుకాణాల సముదాయం నిర్మించి అద్దెకు ఇచ్చారు. వాటిపై మా నమ్మకం నువ్వే జగన్ (Maa Nammakam Nuvve Jagan) అంటూ సీఎం బొమ్మ పెద్దగా ఉండి దుకాణాల పేరు కింద చిన్నవిగా ఉండే బోర్డులు ఉంచడంపై వ్యాపారస్థులు తల పట్టుకుంటున్నారు. వారు వచ్చి దుకాణాల బోర్డులు ఇస్తామనడంతో సరే అన్నామని, ఇలా చేస్తారని అనుకోలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details