By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 10:05 AM IST
పోలవరంపై చంద్రబాబు దూకుడు - శ్వేతపత్రం విడుదలకు సిద్ధం - White Paper on Polavaram Project
CM Chandrababu Release White Paper on Polavaram Project : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయించినందున పోలవరంపై తొలి శ్వేతపత్రాన్ని ఇవాళ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష : గత ప్రభుత్వ హాయంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ముఖ్యమంత్రి చంద్రాబాబు ప్రజలకు తెలపనున్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై నేటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. అమరావతి సచివాలయంలో ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులతో చర్చించనున్నారు.