ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM Chandrababu Press Meet Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 5:21 PM IST

Updated : Aug 28, 2024, 6:34 PM IST

CM Chandrababu Press Meet at Secretariat Live: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2వేల 774 రేషన్ షాపుల ఏర్పాటు ప్రతిపాదనలు మంత్రివర్గం ముందుకు వచ్చాయి. రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం స్థానంలో పోర్టిఫైడ్ బియ్యం అందించడంపైనా చర్చిస్తున్నారు. దీనివల్ల 330 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. పలు అంశాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Aug 28, 2024, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details