తెలంగాణ

telangana

ETV Bharat / videos

పౌరసరఫరశాఖలో వేల కోట్లు స్కామ్‌ జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు : పాయల్‌ శంకర్ - Payal Shankar On Civil Supplies - PAYAL SHANKAR ON CIVIL SUPPLIES

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 2:59 PM IST

BJP MLA Payal Shankar On Civil Supplies in Telangana : పౌరసరఫరాల శాఖలో రూ.2,230 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తెలిపారు.  మిల్లర నుంచి ధాన్యం సేకరించాలని నిబంధన పెట్టారని కానీ బిడ్‌ దక్కించుకున్నవారు మిల్లర్ల నుంచి ధాన్యం సేకరించడంలేదన్నారు. టన్నుకు 2 వేల 230 రూపాయలు అదనంగా తీసుకుని మిల్లర్లకే వడ్లు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. 

ఇలా చేయడం వల్ల వానాకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం నిల్వ చేయడం కష్టమవుతుందన్నారు. బిడ్డర్లు, మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కుతో భారీగా అవకతవలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.54 వేల కోట్ల అప్పుల్లో ఉన్న పౌరసరఫరా సంస్థ శాఖ మరింత రుణాల ఊబిలో కూరుకుపోతుందని పాయల్‌ శంకర్‌ ఆందోళన వ్యక్తంచేశారు.  

ABOUT THE AUTHOR

...view details