LIVE : అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం - Assembly Media point
Published : Jul 31, 2024, 4:13 PM IST
|Updated : Jul 31, 2024, 4:55 PM IST
ASSEMBLY MEDIA POINT LIVE (ETV Bharat)
Assembly Media Point Live : అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన మధ్య సభా రేపటికి వాయిదా పడింది. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయోమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా అని ప్రశ్నించారు. రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా అని నిలదీశారు.
Last Updated : Jul 31, 2024, 4:55 PM IST