LIVE : తెలంగాణ భవన్​ నుంచి బీఆర్​ఎస్​ నేతల మీడియా సమావేశం - BRS Leaders Slams CM Revanth Live

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 3:09 PM IST

Updated : Sep 16, 2024, 3:38 PM IST

thumbnail
BRS Leaders Slams CM Revanth Comments Live : గాంధీ భవన్​లో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. సీఎం అబద్ధపు ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? అని నిలదీశారు. మరోవైపు రెండు లక్షల వరకు ఉన్న రైతుల ఖాతాల్లోనే ఇంకా డబ్బులు జమకాలేదంటే, ఇప్పుడు సరికొత్త నాటకానికి తెరలేపుతున్నారని, రెండు లక్షల రూపాయాలకు పైన ఉన్న రుణాలకు మించి ఉన్న సొమ్మును ముందుగా చెల్లించమనటం సిగ్గుచేటన్నారు. రుణమాఫీపై ప్రశ్నించినందుకు, వరదలపై నిలదీసినందుకు, ఇప్పుడు ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లినందుకు ఇలా ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తిన ప్రతిసారి ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆదివారం ముఖ్యమంత్రి స్పందించిన తీరు, చాలా దౌర్భాగ్యమని వాళ్లను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు రాజకీయంగా హీనమని వ్యాఖ్యానించారు.
Last Updated : Sep 16, 2024, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.