తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు- ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 7:08 AM IST

Updated : Jan 26, 2024, 12:50 PM IST

75th Anniversary Republic Day Celebrations Live : డైమండ్​ జూబ్లీ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ హాజరయ్యారు. కర్తవ్యపథలో 90 నిమిషాల పాటు జరిగే కార్యక్రమంలో మన అపార సైనిక శక్తిని ప్రదర్శించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు హాజరయ్యారు. ప్రియాంకా సేవ్​దా, దీప్తి రాణా అనే మహిళ అధికారులు ఆయుధ లొకేషన్​ గుర్తింపు రాడార్, పినాక రాకెట్​ వ్యవస్థలకు పరేడ్​లో నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని పాడుతున్నారు. సంప్రదాయ బ్యాండ్​కు బదులు శంఖం, నాదస్వరం, నగారా ఉపయోగిస్తున్నారు. అనంతరం 15 మంది స్త్రీలు పైలట్లు వాయు సేన విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. దేశ వార్​ మెమోరియల్​ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరవాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో వేదిక దగ్గరకు చేరుకున్నారు. 

Last Updated : Jan 26, 2024, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details