Science Exhibition in Bangalore 2024: బెంగళూరులో శనివారం 'SC1560' పేరుతో 'సైన్స్ సిటీ ఆఫ్ బెంగళూరు సైంటిఫిక్ హిస్టరీ' ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇందులో 19వ శతాబ్దంలో బెంగళూరులో పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించిన అరుదైన వస్తులు ప్రదర్శించారు. దీంతోపాటు సీవీ రామన్ తబలా, సింప్యూటర్తో సహా 30 రకాల వస్తువులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు:ఇందులో ప్రదర్శించిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన టార్పెడో(ఇనుప ఈటే) ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని బెంగళూరులో డిజైన్ చేశారు. అప్పటి మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ ఈ టార్పెడోను తయారు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై పోరాడేందుకు భారత సైనికులు దీన్ని ఉపయోగించారని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు.
అట్రాక్టివ్గా మున్సెల్ రిక్టర్: 2019లో వివిధ సరస్సుల నుంచి మట్టిని సేకరించి వివిధ ప్రదేశాల్లోని నీటిలో బ్యాక్టీరియాను పెంచారు. ఇదే విధానంలో సూక్షజీవుల పునరుత్పత్తి కొనసాగిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో నేలను బట్టి వివిధ ఆకర్షణీయమైన రంగులు పిక్చర్ ఫ్రేమ్లో కన్పిస్తాయి.
డాక్టర్ సీవీ రామన్ తబలా: భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సీ.వీ రామన్ వాయిద్యాల ప్రకంపనలను అధ్యయనం చేసినప్పుడు పరిశోధన కోసం ఉపయోగించిన తబలాను ప్రదర్శనలో ఉంచారు. విసిటర్స్ కూడా ఈ తబలాను వాయించి ప్రకంపనలు వినేందుకు అవకాశం కల్పించారు.