Young woman Suicide in Gachibowli :హైదరాబాద్గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన యువతి (23) గణేశ్ వేడుకలను చూసేందుకు తన స్నేహితులతో (మరో ఇద్దరు అబ్బాయిలు) కలిసి హైదరాబాద్కు వచ్చింది. గచ్చిబౌలిలోని చిన్న అంజయ్య నగర్లో ఉన్న రెడ్ స్టోన్స్ హోటల్లో వారు 2 గదులు అద్దెకు తీసుకున్నారు. ఆదివారం (సెప్టెంబరు 15) రాత్రి అదే హోటల్లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. తీవ్రంగా తల నొప్పి ఉందని చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
అరగంట అయినా యువతి తిరిగి రాకపోవడంతో ఆరోగ్యం బాగోలేదని ఆమెను వదిలేసి, మిగతా ఇద్దరు స్నేహితులు ట్యాంక్బండ్కు బయలుదేరారు. రాత్రి 3 గంటల తర్వాత తిరిగి హోటల్కు వచ్చారు. యువతి ఉన్న గది తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో హోటల్ సిబ్బందికి సమాచారం అందించారు. వారి సహాయంతో గదిని తెరిచి చూడగా, అప్పటికే గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇది చూసిన స్నేహితులు ఒక్కసారిగా హతాశులయ్యారు.
Suspicious Death in Hotel Gachibowli :హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆమె యశోదా హాస్పిటల్లో నర్సుగా పని చేసినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతబస్తీలోని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.