ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్​స్టేషన్​ నుంచి తప్పించుకున్న విద్యార్థి - రైలు పట్టాలపై మృతదేహం - అసలేం జరిగిందంటే!

14న యువకుడిని పీఎస్​కు తీసుకువచ్చిన పోలీసులు - 15న రైలు పట్టాలపై శవం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

degree_student_commits_suicide
degree_student_commits_suicide (ETV Bharat)

Degree Student Commits Suicide : పోలీసుల అదుపులో ఉండాల్సిన ఓ 18 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై శవమై తేలాడు. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబీకులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్​ శ్యాం ప్రసాద్​కు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం గోపాలపురంలో జరిగిన ఘటన పూర్వాపరాలు బాధితుల కథనం మేరకు ఇలా ఉన్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఓ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికతో చనువుగా ఉండేవాడు. విషయం తెలిసిన బాలిక తల్లి యువకుడిని మందలించింది. మరోసారి ఇద్దరూ చనువుగా కనిపిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. అయినప్పటికీ ఇద్దరూ చనువుగా ఉంటూ మాట్లాడుకోవడం ఆమె కంటపడింది. దీంతో బాలిక తల్లి స్థానిక రూరల్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం ఈ నెల 14న పోలీస్ స్టేషన్​కు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో 15వ తేదీ తెల్లవారుజామున రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై శవమై తేలాడు.

SI and Constable Suspend: పోలీస్​స్టేషన్​లో యువకుడి ఆత్మహత్య.. ఎస్సై, కానిస్టేబుల్​ సస్పెన్షన్​

పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు బలయ్యాడని కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తమ కుమారుడిని స్టేషన్​కు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ఎలాంటి నేరం చేయకున్నా పోక్సో కేసు పెట్టడం వల్లే భయాందోళనకు గురయ్యాడని, అందుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్​కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్​ఐ దినకర్​తో పాటు, పోక్సో కేసుకు కారణమైన బాలిక తల్లిపైనా చర్యలు తీసుకోవాలని యువకుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆందోళన చేశారు.

ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ విచారణ జరిపిస్తామని, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరో వైపు యువకుడి మృతదేహానికి శవ పరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఏఎస్పీ అంకిత సురానా బాధితులతో మాట్లాడి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

'ప్రేమలో మోసపోయాను'- యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో వైరల్​ - LOVE FAILURE

‘మా అమ్మాయిని మరచిపో.. లేదంటే చంపేస్తాం’

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details