తెలంగాణ

telangana

రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఆ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త! - Heavy Rain Alert to Telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 3:51 PM IST

Updated : Sep 6, 2024, 6:57 PM IST

IMD Alert To Telangana Rains : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం మాత్రం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Heavy Rain Alert to Telangana
Heavy Rains in Telangana (ETV Bharat)

Heavy Rain Alert to Telangana :పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 గంటలకు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఈ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త : ఈ నెల 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 9న అతి భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.

10న అతిభారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. భారీ వర్షాల దృష్ట్యా అవసరమైతే కానీ బయటకు ఎవరూ రావద్దని ప్రజలకు సూచించింది. ఇప్పటికే వరుసపెట్టి కురుస్తున్న వానలకు రాష్ట్రం అల్లోకల్లోలమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రకృతి విపత్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూనే, ముందస్తు చర్యలు తీసుకుంటూ ముందుకు కదులుతుంది.

హైదరాబాద్​లో మరోసారి భారీవర్షం - రహదారులపై అడుగులోతు నీరు - Heavy rains in Telangana

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం - central govt announce flood relief

Last Updated : Sep 6, 2024, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details