తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఆ జిల్లాల్లో మళ్లీ టెన్షన్ టెన్షన్

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను అలర్ట్​ - ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

Cyclone Alert to Coastal AP
Heavy Rains Alert to Coastal AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Updated : 6 hours ago

Heavy Rains Alert to Coastal AP :తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను గండం పొంచి ఉంది. ఆదివారం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులలో కొనసాగిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల ఈరోజు ఉదయం తూర్పు - మధ్య బంగాళాఖాతం పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల 22వ తేదీ ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ ఐఎండీ ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

అటు తరువాత ఇది ఈనెల 23న తూర్పు - మధ్య బంగాళాఖాతంలో తుపానుగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీ ఉదయానికి ఒడిశా, పశ్చిమ బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపానుగా ఏర్పడిన తర్వాత ఈ నెల 24,25 తేదీల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రభావం అధికంగా చూపుతుందన్నారు. అందువల్ల ఒడిశా వైపు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వెనక్కి రావాలని ముందస్తుగా సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

IMD Weather Report On Telangana : మరోవైపు ఆదివారం ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక చక్రవాతపు ఆవర్తనం ఇవాళ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి పైకి వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం చెప్పింది. దీంతో తెలంగాణలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది. దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఇవాళ ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ,సూర్యపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రాగల 3 రోజుల పాటు వర్షాలు

ఏపీకి మరో తుపాను 'గండం' - ఈసారి ఆ జిల్లాలకు భారీ ముప్పు

Last Updated : 6 hours ago

ABOUT THE AUTHOR

...view details