ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతిపై ఆకతాయి చేష్టలు - నిలదీసినందుకు తండ్రి గొంతు కోశాడు - Two Men assaulted women - TWO MEN ASSAULTED WOMEN

Two men assaulted women in Hyderabad : ఓ యువతిపై ఇద్దరు ఆగంతకులు వేధింపులకు పాల్పడగా ఈ విషయంపై నిలదీయడానికి వెళ్లిన ఆమె తల్లిదండ్రుపై సైతం దాడికి దిగారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఏకంగా కూరగాయల కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. ఆపై అడ్డువచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు.

WOMEN ASSAULTED IN NARSINGI
Two men assaulted women in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 8:38 PM IST

Two Men assaulted women in Hyderabad :హైదరాబాద్ నగర్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఆకతాయిలు యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. మణికొండ నెమలి నగర్ కాలనీలో కిరాణా దుకాణానికి వెళ్లిన విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. హోలీ పండుగ రోజు దొరకలేదంటూ సురేశ్​ అనే యువకుడు విద్యార్థిని ఒంటిపై నీళ్లు పోశాడు. ఈ క్రమంలో యువతి అతడి నుంచి తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా నిలదీయడానికి వెళ్లిన యువతి తల్లిదండ్రులపై సైతం కూరగాయల కత్తితో సురేశ్​, అతని తమ్ముడు ప్రవీణ్​ దాడి చేశారు.

సురేశ్​ తమ్ముడు ప్రవీణ్ కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లిపైన కూడా కత్తితో దాడికి దిగాడు. దీంతో బాధితులు నార్సింగి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై 354డీ, 354 ఐపీసీ సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ప్రవీణ్, సురేశ్​ను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details