ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పండుగ వేళ మామిడాకుల కోసం గొడవ - వ్యక్తిపై కత్తితో దాడి - Accidents on Vinayaka Chavithi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 3:51 PM IST

Tragedy Incidents on Vinayaka Chavithi 2024: రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న సందర్భంలో పలుచోట్లు విషాద ఘటనలు చొటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లాలో మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. నెల్లూరు జిల్లాలో వినాయకుని విగ్రహం తీసుకువెళ్తున్న ట్రాక్టర్‌ని టిప్పర్‌ ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. మరోచోట వినాయక మండపంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు.

Accidents_on_Vinayaka_Chavithi
Accidents_on_Vinayaka_Chavithi (ETV Bharat)

Tragedy Incidents on Vinayaka Chavithi Today:మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటు చేసుకుంది. మిర్యాల అర్జునరావు (61) అనే వ్యక్తి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని మామిడి ఆకులు కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న గెడ్డం నాంచారయ్య (36) మా అనుమతి లేకుండా ఇంటిలోని మామిడి ఆకులు ఎలా కోస్తారని అర్జునరావుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాట మాట పెరిగి నాంచారయ్య వంటగదిలోని కత్తి తీసుకువచ్చి మిర్యాల అర్జునరావుపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తల్లి, కుమారుడు దుర్మరణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరయ్యపల్లెమెట్ట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లి, కుమారుడు దుర్మరణం చెందారు. మృతులు వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం నందిపల్లెకు చెందిన కాంతమ్మ, జగదీశ్వర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీ కొట్టడంతో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కుమారుడిని కొట్టిన టీచర్ - చర్యలు తీసుకోవాలని తండ్రి పోరాటం - Father Complaint on teacher

విగ్రహంతో వెళ్తున్న ట్రాక్టర్​ని ఢీ కొట్టిన టిప్పర్: నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం తీసుకువెళ్తున్న ట్రాక్టర్‌ని టిప్పర్‌ ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు కావలి పాతూరుకు చెందిన వారుగా గుర్తించారు. ఉలవపాడు మండలం చాగొళ్లు వద్ద వినాయకుడి విగ్రహం కొనుగోలు చేసి వెళ్తుండగా వీరేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని కావలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Young Man Died in Vinayaka Mandapam: పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలం పొట్లూరులో విషాదం చోటు చేసుకుంది. వినాయక మండపంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. పండుగ సందర్బంగా గణేశ్‌ మండపంలో లైట్లు వేస్తుండగా అకస్మాత్తుకగా విద్యుత్ షాక్​తో తగలడంతో దేవసహాయం (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చందాడు.

రాష్ట్రవ్యాప్తంగా గణేశుడి సందడి - విజయవాడలో సీఎం చంద్రబాబు పూజలు - Ganesh Chathurthi 2024

తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు - VINAYAKA CHAVITHI Festival in AP

ABOUT THE AUTHOR

...view details